పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ పర్యటన: 700 మంది జర్నలిస్టుల కవరేజ్
- January 31, 2019
30 దేశాలకు చెందిన 700 మంది జర్నలిస్టులకు నేషనల్ మీడియా కౌన్సిల్ (ఎన్ఎంసీ), మూడు రోజులపాటు పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ పర్యటనను కవర్ చేసేందుకు అనుమతిచ్చింది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు యూఏఈలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన జరుగుతుంది. కేథలిక్ చర్చ్ హెడ్ అయిన పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చే సందేశం గురించి ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుందనీ, యూఏఈలో ఆయన పర్యటన ఎంతో ఆసక్తిదాయకంగా జరగనుందనీ ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను కవరేజ్ చేయడానికి వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో యూఏఈకి రానున్నారనీ అధికారులు తెలిపారు. యూరోప్కి చెందిన యూరోపియన్ ప్రెస్ ఫొటో ఏజెన్సీ, రుప్ట్లీ టీవీ మరియు కేథోలిషె నాచిరిచ్టన్ అజెంటుర్ (జర్మనీ), రేడియో ఫ్రాన్స్, లె ఫిగారో, ఎఎఫ్పి మరియు ఫ్రాన్స్ 24 మీడియా సంస్థలు పోప్ పర్యటనను కవర్ చేయబోతున్నాయి. టర్కీ, అర్జెంటీనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, హాంగ్కాంగ్, జపాన్ నుంచి కూడా జర్నలిస్టులు రానున్నారు. షేక్ జాయెద్ మాస్క్ సహా పలు ముఖ్యమైన ప్రాంతాల్ని యూఏఈ పర్యటనలో భాగంగా పోప్ సందర్శిస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







