అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సాయం చేస్తాం:రవికుమార్ వేమూరు
- January 31, 2019
అమరావతి: అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు స్పష్టం చేశారు. తెలుగు విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థులు అక్కడి నుంచి రావడం ఇష్టం లేక కొన్ని గుర్తింపు లేని యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏటా రహస్య దర్యాప్తు చేపడుతోందన్నారు. ఆ దర్యాప్తులో భాగంగా 8 మంది తెలుగు విద్యార్థులు... ఇతర విద్యార్థులను నకిలీ యూనివర్సిటీల్లో చేర్పిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తుందన్నారు. అయితే, అందులో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. ఏపీ ఎన్ఆర్టీ తరఫున అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించారు.
తెలుగు విద్యార్థులు విదేశాలకు వెళ్లేముందు అక్కడి చట్టాలను క్షుణ్నంగా తెలుసుకోవాలని, లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుందని ఏపీ ఎన్ఆర్టీ సీఈవో కొడాలి భవానీశంకర్ అన్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







