అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సాయం చేస్తాం:రవికుమార్ వేమూరు
- January 31, 2019
అమరావతి: అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు స్పష్టం చేశారు. తెలుగు విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థులు అక్కడి నుంచి రావడం ఇష్టం లేక కొన్ని గుర్తింపు లేని యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏటా రహస్య దర్యాప్తు చేపడుతోందన్నారు. ఆ దర్యాప్తులో భాగంగా 8 మంది తెలుగు విద్యార్థులు... ఇతర విద్యార్థులను నకిలీ యూనివర్సిటీల్లో చేర్పిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తుందన్నారు. అయితే, అందులో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. ఏపీ ఎన్ఆర్టీ తరఫున అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించారు.
తెలుగు విద్యార్థులు విదేశాలకు వెళ్లేముందు అక్కడి చట్టాలను క్షుణ్నంగా తెలుసుకోవాలని, లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుందని ఏపీ ఎన్ఆర్టీ సీఈవో కొడాలి భవానీశంకర్ అన్నారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







