సౌదీ అరేబియాలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరి
- February 01, 2019
సౌదీ అరేబియా: సౌదీలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరిశిక్ష విధించారు. 2015లో జరిగిన ఓ హత్య కేసులో ఆమెపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. దీంతో, అధికారులు ఆమెను ఉరితీశారు. వివరాల్లోకి వెళ్లితే ...ఫిలిపినా(39) (పేరు మార్చబడింది) అనే మహిళ ఓ ఇంట్లో పనిచేసేది. ఆమె తన యజమానురాలిని అత్యంత కిరాతకంగా హత్యచేసింది. తానే ఈ హత్యకు పాల్పడినట్టు విచారణలో అంగీకరించింది. ఫిలిపినాకు ఉరిశిక్ష విధించబోయే సమాచారాన్ని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖకు ఒక రోజు ముందుగా తెలిపినట్టు సౌదీ ప్రకటించింది. కాగా, అరబ్ కింగ్డమ్లోని దేశాలు గతేడాది 143 మందిని ఉరితీసినట్టు యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. ఉరిశిక్షల అమలులో సౌదీ 5వ స్థానంలో ఉందని తెలిపింది. సౌదీలో దాదాపు 10లక్షల మంది ఫిలిప్పీన్స్కు చెందిన పౌరులు పనిచేస్తున్నారని తెలిపింది. అయితే, హత్య, లైంగికదాడి, మారణాయుధాలతో దాడి వంటి కేసులను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి మరణదండన విధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







