సౌదీ అరేబియాలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరి
- February 01, 2019
సౌదీ అరేబియా: సౌదీలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరిశిక్ష విధించారు. 2015లో జరిగిన ఓ హత్య కేసులో ఆమెపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. దీంతో, అధికారులు ఆమెను ఉరితీశారు. వివరాల్లోకి వెళ్లితే ...ఫిలిపినా(39) (పేరు మార్చబడింది) అనే మహిళ ఓ ఇంట్లో పనిచేసేది. ఆమె తన యజమానురాలిని అత్యంత కిరాతకంగా హత్యచేసింది. తానే ఈ హత్యకు పాల్పడినట్టు విచారణలో అంగీకరించింది. ఫిలిపినాకు ఉరిశిక్ష విధించబోయే సమాచారాన్ని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖకు ఒక రోజు ముందుగా తెలిపినట్టు సౌదీ ప్రకటించింది. కాగా, అరబ్ కింగ్డమ్లోని దేశాలు గతేడాది 143 మందిని ఉరితీసినట్టు యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. ఉరిశిక్షల అమలులో సౌదీ 5వ స్థానంలో ఉందని తెలిపింది. సౌదీలో దాదాపు 10లక్షల మంది ఫిలిప్పీన్స్కు చెందిన పౌరులు పనిచేస్తున్నారని తెలిపింది. అయితే, హత్య, లైంగికదాడి, మారణాయుధాలతో దాడి వంటి కేసులను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి మరణదండన విధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







