సౌదీ అరేబియాలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరి
- February 01, 2019
సౌదీ అరేబియా: సౌదీలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరిశిక్ష విధించారు. 2015లో జరిగిన ఓ హత్య కేసులో ఆమెపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. దీంతో, అధికారులు ఆమెను ఉరితీశారు. వివరాల్లోకి వెళ్లితే ...ఫిలిపినా(39) (పేరు మార్చబడింది) అనే మహిళ ఓ ఇంట్లో పనిచేసేది. ఆమె తన యజమానురాలిని అత్యంత కిరాతకంగా హత్యచేసింది. తానే ఈ హత్యకు పాల్పడినట్టు విచారణలో అంగీకరించింది. ఫిలిపినాకు ఉరిశిక్ష విధించబోయే సమాచారాన్ని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖకు ఒక రోజు ముందుగా తెలిపినట్టు సౌదీ ప్రకటించింది. కాగా, అరబ్ కింగ్డమ్లోని దేశాలు గతేడాది 143 మందిని ఉరితీసినట్టు యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. ఉరిశిక్షల అమలులో సౌదీ 5వ స్థానంలో ఉందని తెలిపింది. సౌదీలో దాదాపు 10లక్షల మంది ఫిలిప్పీన్స్కు చెందిన పౌరులు పనిచేస్తున్నారని తెలిపింది. అయితే, హత్య, లైంగికదాడి, మారణాయుధాలతో దాడి వంటి కేసులను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి మరణదండన విధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







