అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైలింగ్ చెయ్యకపోతే 50,000 దిర్హామ్ల జరీమానా
- February 02, 2019అబుదాబీలో ఓ వ్యక్తి అబ్ స్కాండింగ్ రిపోర్ట్ ఫైనల్ చేయని కారణంగా 50,000 దిర్హామ్ల జరీమానాకి గురయ్యాడు. రన్ వే వర్కర్కి సంబంధించి 10 రోజుల గ్రేస్ పీరియడ్లో అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైల్ చేయని కారణంగా నిందితుడికి ఈ జరీమానా విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఉద్యోగి అబ్స్కాండింగ్పై 9 రోజుల లోపే తాను తహ్సీల్ సర్వీస్ సెంటర్కి ఫిర్యాదు చేసినట్లు నిందితుడు వివరించారు. మరో ఎంప్లాయర్ వద్ద ఆ వ్యక్తి (అబ్స్కాండింగ్ అయిన వ్యక్తి) ఉద్యోగానికి చేరినట్లు నిందితుడు పేర్కొన్నారు. చట్ట ప్రకారం అబ్స్కాడింగ్కి సంబంధించి పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్కి నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వవలసి వుంటుంది. లేనిపక్షంలో 50,000 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ