యూఏఈ విచ్చేయనున్న పోప్..అసలెందుకింత ప్రాధాన్యం?

- February 03, 2019 , by Maagulf
యూఏఈ విచ్చేయనున్న పోప్..అసలెందుకింత ప్రాధాన్యం?

దుబాయ్‌: క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ నేడు చారిత్రక పర్యటనకు బయల్దేరారు. దుబాయ్‌లో జరగనున్న 'ఇంటర్‌ఫెయిత్‌ కాన్ఫరెన్స్‌'కు ఆయన హాజరు కానున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని అబుదాబీ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నెహ్యాన్‌ ఆయన్ను ఆహ్వానించారు. ఆయన ఇప్పటికే వాటికస్‌ సిటీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. మంగళవారం జరగనున్న ఈ సదస్సుకు దాదాపు లక్షా 20 వేల మంది హాజరవుతారని అంచనా. ''సోదరభావం, సహనశీలతలకు నిదర్శనంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ సంస్కృతులు కలిసే ప్రదేశం'' అని పోప్‌ దుబాయ్‌కు కితాబిచ్చారు. తన పర్యటనలో భాగంగా కైరోకు చెందిన అల్‌-అజ్మర్‌ మసీదు ఇమామ్‌తో కూడా భేటీ కానున్నారు.

ఎందుకింత ప్రధాన్యం..
యెమన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని పోప్‌ ఇప్పటికే చాలా ఖండించారు. ఈ యుద్ధంలో భాగంగా సౌదీతోపాటు యూఏఈ కూడా యెమన్‌పై దాడులు నిర్వహిస్తోంది. గత ఏడాది పోప్‌ మాట్లాడుతూ యెమన్‌లో మానవీయత దిగజారకుండా కాపాడుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పోప్‌ ఇక్కడికి రానుండటం విశేషం. యుఏఈలో దాదాపు 10 లక్షల మంది రోమన్‌ కేథలిక్‌లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది భారత్‌, ఫిలిప్పన్స్‌ నుంచి వచ్చినారే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com