యూఏఈ విచ్చేయనున్న పోప్..అసలెందుకింత ప్రాధాన్యం?
- February 03, 2019
దుబాయ్: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ నేడు చారిత్రక పర్యటనకు బయల్దేరారు. దుబాయ్లో జరగనున్న 'ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్'కు ఆయన హాజరు కానున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని అబుదాబీ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ ఆయన్ను ఆహ్వానించారు. ఆయన ఇప్పటికే వాటికస్ సిటీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. మంగళవారం జరగనున్న ఈ సదస్సుకు దాదాపు లక్షా 20 వేల మంది హాజరవుతారని అంచనా. ''సోదరభావం, సహనశీలతలకు నిదర్శనంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ సంస్కృతులు కలిసే ప్రదేశం'' అని పోప్ దుబాయ్కు కితాబిచ్చారు. తన పర్యటనలో భాగంగా కైరోకు చెందిన అల్-అజ్మర్ మసీదు ఇమామ్తో కూడా భేటీ కానున్నారు.
ఎందుకింత ప్రధాన్యం..
యెమన్లో జరుగుతున్న యుద్ధాన్ని పోప్ ఇప్పటికే చాలా ఖండించారు. ఈ యుద్ధంలో భాగంగా సౌదీతోపాటు యూఏఈ కూడా యెమన్పై దాడులు నిర్వహిస్తోంది. గత ఏడాది పోప్ మాట్లాడుతూ యెమన్లో మానవీయత దిగజారకుండా కాపాడుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పోప్ ఇక్కడికి రానుండటం విశేషం. యుఏఈలో దాదాపు 10 లక్షల మంది రోమన్ కేథలిక్లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది భారత్, ఫిలిప్పన్స్ నుంచి వచ్చినారే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..