రికార్డు సృష్టించిన కుంభమేళా
- February 05, 2019యూపీ: ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవరి 4వ తేదీ సోమవారం ఈ రికార్డ్ క్రియేట్ అయ్యింది. సోమవారం మౌని అమావాస్య. దీంతో ఒక్క రోజే 5 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మౌని అమావాస్యను కుంభమేళాలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారని, వారిని స్మరిస్తూ పుణ్యస్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు. నాగా సాధువులుగా మారాలనుకునే వారు మౌని అమావాస్య రోజునే దీక్ష తీసుకున్నారు. మౌని అమావాస్య రోజున గంగా నదిలో నీళ్లు అమృతంగా మారుతాయని శాస్త్రోక్తి. అందుకే ఈ రోజున గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
కుంభమేళాలో మూడు సాహ్నీ స్నానాలు ఉంటాయి. తొలి స్నానం కుంభమేళా ప్రారంభమైన మకర సంక్రాంతి రోజు, రెండో మౌని అమావాస్య రోజు, మూడోది వసంత పంచమి (ఫిబ్రవరి 10)న ఉంటాయి. ప్రయాగ్ రాజ్లో భక్తుల రాక అంతకంతకూ పెరుగుతోంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. జైన తీర్థంకరుల్లో మొదటివాడైన రిషభదేవుడు మౌని అమావాస్య రోజున తన మౌన వ్రతాన్ని విరమించి, పుణ్య నదుల్లో స్నానం చేశాడని జైనులు నమ్ముతారు. దీంతో జైనులు కూడా మౌని అమావాస్య రోజున భారీగా తరలివచ్చి స్నానాలు చేశారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు