అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నాకు దిగిన భారతీయులు
- February 11, 2019అమెరికాలో భారతీయులు వైట్ హౌస్ ముందు ధర్నాకు దిగారు. గ్రీన్ కార్డు ధరఖాస్తు చేసుకున్న తమ ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని కోరుతూ సుమారు 12వందల మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ వద్దకు చేరుకున్న గ్రీన్ కార్డు ధరఖాస్తుదారులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. H1B వీసాపై వచ్చి దశాబ్ధానికి పైగా ఇక్కడే ఉన్నా గ్రీన్ కార్డులు ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న కోటా ప్రకారమే ఇవ్వాలనుకుంటే..ప్రస్తుతం ధరఖాస్తులు క్లియర్ చేయడానికి వందేళ్లు పడుతుందంటున్నారు. గత ఏడాది మార్చిలో కూడా ఇదే తరహా పోరాటం చేశారు. వీరి ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ బిల్లులో కొన్ని అంశాలు చేర్చి.. కాంగ్రెస్ లో పెట్టారు. కానీ బిల్లు వీగిపోయింది. మరోసారి దీనిపై పోరాటానికి ఎన్నారైలు సిద్దమయ్యారు.
కాశ్మీర్లో మరోసారి తెగబడ్డ తీవ్రవాదులు
ఇటీవల అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోకి అక్రమంగా వలసవచ్చిన వారి పట్ల మానవతా దృక్పథంతో దేశంలో ఉండేలా అనుమతించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇది మరింత ఆగ్రహాలకు కారణమవుతోంది. ముందుగా లీగల్ గా అమెరికా వచ్చిన తమ సంగతి తేల్చకుండా అక్రమంగా చొరబడినవారికి పౌరసత్వం ఇవ్వాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీగల్ గా అమెరికా వచ్చి దశాబ్ధానికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి వెంటనే పౌరసత్వం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లికన్ హిందూ కొహలేషన్ సంస్థ ప్రతినిధులు యష్ బొద్దలూరి, కృష్ణ బన్సల్ నేతృత్వంలో ఈ ధర్న చేపట్టారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం