ఇండియన్ సోషల్ వర్కర్ని సత్కరించనున్న సొసైటీ
- February 11, 2019బహ్రెయిన్: ప్రముఖ సోషల్ వర్కర్, యాక్టివిస్ట్ దయా బాయ్ని సిమ్స్ జిఎఫ్ఎస్ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ పురస్కారంతో సత్కరించనున్నట్లు సైరో మలబార్ సొసైటీ (ఎస్వైఎమ్ఎస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్కొనడం జరిగింది. సెంట్రల్ ఇండియాలో ట్రైబల్స్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కోసం ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం ఆమెకు దక్కుతోంది. మనామాలో మార్చి 1న ఇండియన్ క్లబ్ ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 2012 నుంచి ఎస్వైఎమ్ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ అవార్డుని హ్యుమానిటేరియన్, జెనరస్ సర్వీస్ రంగాల్లో అత్యున్నతమైన పేరు ప్రఖ్యాతులు సాధించినవారికి అందిస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా డిస్ట్రిక్ట్లో దయా బాయి నలభయ్యేళ్ళుగా ట్రైబల్స్తో కలిసి నివసిస్తున్నారు. ఆమె తన సేవల్ని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. అలాగే బంగ్లాదేశ్లోనూ ఆమె సేవలందించినట్లు ఎస్వైఎమ్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







