ఇండియన్ సోషల్ వర్కర్ని సత్కరించనున్న సొసైటీ
- February 11, 2019బహ్రెయిన్: ప్రముఖ సోషల్ వర్కర్, యాక్టివిస్ట్ దయా బాయ్ని సిమ్స్ జిఎఫ్ఎస్ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ పురస్కారంతో సత్కరించనున్నట్లు సైరో మలబార్ సొసైటీ (ఎస్వైఎమ్ఎస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్కొనడం జరిగింది. సెంట్రల్ ఇండియాలో ట్రైబల్స్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కోసం ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం ఆమెకు దక్కుతోంది. మనామాలో మార్చి 1న ఇండియన్ క్లబ్ ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 2012 నుంచి ఎస్వైఎమ్ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ అవార్డుని హ్యుమానిటేరియన్, జెనరస్ సర్వీస్ రంగాల్లో అత్యున్నతమైన పేరు ప్రఖ్యాతులు సాధించినవారికి అందిస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా డిస్ట్రిక్ట్లో దయా బాయి నలభయ్యేళ్ళుగా ట్రైబల్స్తో కలిసి నివసిస్తున్నారు. ఆమె తన సేవల్ని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. అలాగే బంగ్లాదేశ్లోనూ ఆమె సేవలందించినట్లు ఎస్వైఎమ్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు