తెలంగాణ:ఆన్లైన్లోనే మ్యారేజ్ ముస్లీం సర్టిఫికెట్
- February 11, 2019హైదరాబాద్: ముస్లిములు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వక్ఫ్బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ-ఖజ్జత్(ఆన్లైన్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు వక్ఫ్బోర్డు కార్యాలయంలో ఆన్లైన్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు విధానాన్ని మహమూద్ అలీ, వక్ఫ్బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ సలీం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని, ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ-ఖజ్జత్ విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం వక్ఫ్బోర్డు కార్యాలయానికి వచ్చే వారని, ఇప్పుడు ఆ సమస్య తలెత్తదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, గడువు తేదీన కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. WAQF.TELANGANA.GOV.IN వెబ్సైట్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ