దుబాయ్ నుంచి వచ్చి భార్యను హత్యచేసిన భర్త

- February 13, 2019 , by Maagulf
దుబాయ్ నుంచి వచ్చి భార్యను హత్యచేసిన భర్త

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో భార్యను భర్త హత్యచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని లాలాగూడకు చెందిన నఫీజ్‌బేగం(24), రఫీ(27) భార్యాభర్తలు. రఫీ దుబాయ్ లో ఉంటున్నాడు. బుధవారం ఉదయమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అనంతరం సికింద్రాబాద్ లోని లోటస్‌ గ్రాండ్‌ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. కాగా.. లాడ్జికి భార్య నఫీజ్‌బేగంను రమ్మన్నాడు. దీంతో అక్కడకు వచ్చిన ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేశాడు. లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com