భారత్లో ఉగ్రదాడి, ఖండించిన యూఏఈ
- February 15, 2019
భారతదేశంలో జరిగిన ఉగ్రదాడిని యూఏఈ ఖండించింది. జమ్మూకాశ్మీర్లో తీవ్రవాదులు, నిన్న జరిపిన మారణహోమంలో 39 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఓ ప్రకటన ద్వారా ఈ ఘటనను ఖండించడం జరిగింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలనీ, ఆధునిక సమాజంలో హింసకు తావులేదని యూఏఈ ఆ ప్రకటనలో పేర్కొంది. మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు యూఏఈ మినిస్ట్రీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..