పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి:9మంది సైనికుల మృతి

- February 17, 2019 , by Maagulf
పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి:9మంది సైనికుల మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది పాక్‌సైనికులు మృతిచెందారు. బలూచిస్థాన్‌లో సైనిక కాన్వాయ్‌ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, బలూచ్‌ రిపబ్లికన్‌ గార్డ్స్‌ సంస్థలు కారణమని అక్కడ నిఘావర్గాలు అనుమానిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాక్‌లో పర్యటించే కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com