పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి:9మంది సైనికుల మృతి
- February 17, 2019
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది పాక్సైనికులు మృతిచెందారు. బలూచిస్థాన్లో సైనిక కాన్వాయ్ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు కారణమని అక్కడ నిఘావర్గాలు అనుమానిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్లో పర్యటించే కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







