స్వదేశానికి వెళ్ళే ప్రయత్నంలో వలసదారుడి మృతి

- February 18, 2019 , by Maagulf
స్వదేశానికి వెళ్ళే ప్రయత్నంలో వలసదారుడి మృతి

బహ్రెయిన్a:62 ఏళ్ళ బహ్రెయినీ రెసిడెంట్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతుడ్ని అబ్దుల్‌ గఫ్ఫార్‌గా గుర్తించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన అబ్దుల్‌ గఫ్ఫార్‌, 17 ఏళ్ళుగా బహ్రెయిన్‌లో హెవీ ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ మైనింగ్‌, ఎర్త్‌ మూవింగ్‌, మార్బుల్‌ సప్లయ్‌ కంపెనీలో పనిచేస్తున్నారాయన. స్వదేశానికి వెళ్ళేందు కోసం ప్రయత్నాల్లో వుండగా, కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ దుబాయ్‌ నుంచి అందుకోవాల్సిన అబ్దుల్‌ గఫ్ఫార్‌, దుబాయ్‌లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 11 నెలలుగా అబ్దుల్‌ గఫార్‌కి ఆయన పనిచేస్తున్న కంపెనీ నుంచి ఎలాంటి జీత భత్యాలూ అందలేదని వారు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com