అమర జవాన్ల రుణాలు మాఫీ:ఎస్.బీ.ఐ

- February 18, 2019 , by Maagulf
అమర జవాన్ల రుణాలు మాఫీ:ఎస్.బీ.ఐ

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్ కే వీర్ కు తమ వంతు సాయం చేస్తామని తెలిపింది. బయటివ్యక్తులు కూడా విరాళం అందిచాలనుకుంటే బ్యాంకు వర్గాలను సంప్రదించాలని సూచించింది.అంతేకాకుండా అమరులైన జవాన్ల ఒక్కొక్కరి కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ ఎస్ బీఐ విడుదల చేయనుంది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లందరూ ఎస్బీఐ ఖాతాదారులు. వారికి శాలరీ ఈ అకౌంట్ నుంచే అందుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com