ఇమ్రాన్ జీ.. పుల్వామా ఉగ్రదాడి మా పనే : జైషే మహమ్మద్
- February 20, 2019
పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందంటూ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించి కొన్ని గంటలు కాకముందే తీవ్రవాద సంస్థ జైష్ మహహ్మద్ తేరుకోలేని ఝులక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడి తమపనేనంటూ రెండో వీడియో ఆధారాన్ని విడుదల చేసింది.
పైగా, ఇమ్రాన్ ఖాన్ అడుగుతున్న అన్ని రకాల ఆధారాలను వీడియో ద్వారా బయటపెట్టి.. సాక్ష్యాలను తనకు తానే అందించింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనే అంటూ రెండో వీడియోను మంగళవారం విడుదల చేసింది. అంతేకాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని వీడియోలో పేర్కొనడం గమనర్హం. ఈ వీడియోతో ఇమ్రాన్ ఖాన్ ఇపుడు డైలామాలో పడ్డారు.
కాగా, పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని, ఒక దేశంలో మరో దేశం ఇలాంటి ఆరోపణలు చేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. తమ దేశం కూడా స్వయంగా ఉగ్ర బాధిత దేశమేనని వాపోయారు. తమపై నిందలు వేస్తున్న భారత్.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి రుజువులు ఉంటే చూపాలని పదే పదే కోరారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జైషే... దాడులు తమ పనే అంటూ రెండో వీడియో విడుదల చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







