తెలంగాణ:అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
- February 22, 2019
హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జవాన్ల ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన విధానం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జవాన్లకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు. శాసనసభ ప్రారంభం కంటే ముందు బడ్జెట్ పత్రాలను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







