తెలంగాణ:అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
- February 22, 2019హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జవాన్ల ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన విధానం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జవాన్లకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు. శాసనసభ ప్రారంభం కంటే ముందు బడ్జెట్ పత్రాలను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు