భారతీయ కార్మికుడ్ని వరించిన అదృష్టం
- February 25, 2019భారతీయ కార్మికుడొకర్ని అదృష్టం వరించింది. తన మొబైల్ ఫోన్ని రెన్యూ చేసుకోవడంతో ఊహించని అదృష్టం ఆయన సొంతమయ్యింది. వివరాల్లోకి వెళితే బల్వీర్ సింగ్ అనే వ్యక్తి, తన మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేయించుకోగా, 570 ఎస్ స్పైడర్ కారు అతనికి బహుమతిగా లభించింది. తన జీవితంలో తానెప్పుడూ ఊహించనంత గొప్ప బహుమతి ఇప్పుడు తనకు లభించిందని ఆయన అంటున్నారు. ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఈఐటిసి) డ్యు, యూఏఈ రిజిస్ట్రేషన్ పాలసీ నేపథ్యంలో ఈ బహుమతిని అతనికి అందజేసింది. గడువు తీరిన ఐడీ రిజిస్ట్రేషన్స్ని కొత్తగా రెన్యూ చేసుకుంటే, సర్వీస్ కటాఫ్ నుంచి వెసులుబాటు కల్పిస్తామని చెబుతూ, ఇందుకు జనవరి 31వ తేదీని డెడ్లైన్గా ప్రకటించారు. అలా రెన్యూ చేయించుకున్నవారిని బంపర్ డ్రాలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. బల్వీర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్