పాకిస్తాన్: భారత్ దాడులకు తగిన విధంగా సమాధానం చెప్తాం
- February 26, 2019
ఇస్లామాబాద్: పాక్ ఉగ్రదాడి శిబిరాలపై భారత వాయుసేన దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై పాకిస్థాన్ విదేశాంగా మంత్రి షా మహమూద్ ఖురేషీ ఘాటుగా స్పందించారు. ఇండియా మరీ దూకుడుగా వ్యవహరించింది అని ఆయన అన్నారు. కాగా భారత్ ఇది నియంత్రణ రేఖను ఉల్లంఘించడమే అవుతుంది. పాకిస్థాన్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది. మేము కూడా దీటుగానే స్పందిస్తాం అని ఖురేషీ హెచ్చరించారు. పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ (పీటీఐ) ఆయన ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. పాకిస్థాన్తో పెట్టుకోవద్దు.. ఇండియా ఎలాంటి దుస్సాహసం చేసినా అందుకు తగినట్లు స్పందిస్తాం అని ఇండియాను ఖురేషీ హెచ్చరించారంటూ పీటీఐ మరో ట్వీట్ చేసింది. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని ఇండియా చెడగొడుతున్నదని ఖురేషీ ఆరోపించడం గమనార్హం. ఈ దాడుల తర్వాత ఖురేషీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







