తీవ్రవాదాన్ని తిరస్కరించిన భారత ముస్లింలు: సుష్మా స్వరాజ్
- March 01, 2019
విషం చిమ్మే తీవ్రవాదాన్ని భారత ముస్లింలు సహించబోరని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. అబుదాబీలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్లో పాల్గొన్న సుష్మా స్వరాజ్ భారత స్వరాన్ని బలంగా విన్పించారు. ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా శాంతినే నమ్ముతోన్న దేశం తరఫున తాను ఈ సమావేశంలో ప్రాతినిత్యం వహిస్తున్నాననీ, ఇది తనకు గర్వంగా వుందని అన్నారామె. ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలున్నా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని ఆమె అన్నారు. 1.3 బిలియన్ ఇండియన్స్ అందులో 185 మంది ముస్లిం సోదరులు, సోదరీమణుల శుభాకాంక్షల్ని తాను తీసుకొచ్చినట్లు సుష్మ పేర్కొనడం గమనార్హం. భారతదేశంలో ముస్లింలు కూడా భాగమనీ, ఆయా రాష్ట్రాల్లో ఆయా భాషల్ని ముస్లింలు అనుసరిస్తున్నారని, వారంతా భారతదేశంలో క్షేమంగా వున్నారనీ, వుంటారని సుష్మా స్వరాజ్ అన్నారు. తీవ్రవాదాన్ని ఎవరూ ఉపేక్షించరాదనీ, ప్రపంచానికి తీవ్రవాదం పెనుముప్పుగా మారిందని చెప్పారామె.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







