చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది
- March 01, 2019
చనిపోయినట్లుగా నటించిన ఓ ఉగ్రవాది భద్రతా బలగాలు అతడి దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సిబ్బంది రావడం గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది వెళ్లారు.
అదే అదనుగా భావించిన ఉగ్రవాది అప్పటి వరకు చనిపోయినట్లుగా నటించాడు. భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు, ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్కౌంటర్ జరిగే ప్రదేశానికి సమీపంలో ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్వారాలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్, బాలాకోట్, కృష్ణఘాటి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ బలగాల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా నేషనల్ హెల్త్ సర్వే ప్రారంభం..!!
- యుద్ధాన్ని పూర్తిగా ముగించడంపైనే ఫోకస్.. ఖతార్
- ప్రభుత్వ పాఠశాలల కోసం ఐబీ (IB) ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- ప్రాంతీయ పరిణామాలపై ఒమన్,ఖతార్ చర్చలు..!!
- Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!









