కొత్త జనరేషన్ స్కూల్స్ కోసం 1.5 బిలియన్ దిర్హామ్లు
- March 05, 2019
న్యూ జనరేషన్ - ఎమిరేటీ స్కూల్స్ కోసం 1.5 బిలియన్ దిర్హామ్లు కేటాయించినట్లు వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. డిజైన్ లేబోరేటరీస్, రోబోట్స్, ఆర్టిఫీషియల్, ఇంటెలిజెన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ లేబరేటరీస్ మరియు స్పెషల్ స్పోర్ట్ ఫెసిలిటీస్ కోసం ఈ నిధులు వెచ్చిస్తారు. కొత్త జనరేషన్ కోసం కొత్త ఆలోచనలు తప్పనిసరి అని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు. రానున్న 50 ఏళ్ళలో సరికొత్త ఆలోచనల దిశగా ముందడుగు వేయాల్సి వుంటుందని, అదే మనం తదుపరి జనరేషన్కి ఇచ్చే బహుమతి అని మరో ట్వీట్లో షేక్ మొహమ్మద్ చెప్పారు. కాగా, యూఏఈ వ్రైస్ ప్రెసిడెంట్, 100 మిలియన్ దిర్హామ్ల ఫండన్ని, 65,000 మంది స్టూడెంట్స్కి సంబంధించి కెరీర్ పాత్స్ డెవలప్మెంట్, బిజినెస్ ఓరియెంటెడ్ మైండ్స్ వంటి విభాగాల్లో ఖర్చు చేసేందుకోసం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లాజిస్టిక్స్, ఆయిల్ మరియు గ్యాస్, రిటెయిల్ సెక్టార్లలో యువత ఆలోచనలు ఇందులో భాగం.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









