శివుడు సృష్టి ఆదియోగి..యోగశాస్త్ర సృష్టికర్త
- March 05, 2019ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు కోయంబత్తూరులో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.
లయకారుడైన శివుడు సృష్టికే ఆదియోగి. ఆయన నుంచే యోగశాస్త్రం ఆవిర్భవించింది. దేశంలోని ప్రముఖ యోగ, ధ్యాన కేంద్రమైన ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎప్పటిలా ఈసారి కూడా అత్యంత వైభవంగా, విలక్షణంగా నిర్వహించారు. భక్తిని, యోగ ధ్యానాలతో మిళితం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించింది.
ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. శూన్యంలో నుంచి పుట్టి శూన్యంలో విలీనమవ్వడమన్న ఆధ్యాత్మిక చింతనను మహా శివరాత్రి వేడుకల్లో ప్రధానంగా వివరించారు. ఈ ఏడాది సద్గురు జెగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత