పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సం..
- December 29, 2015
పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సాన్ని సృష్టించింది. మార్దాన్ నగరంలో చోటు చేసుకున్న ఈ పేలుడులో 22 మంది మరణించగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ డాటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అధారిటీ కార్యాలయం దగ్గర ఆ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియా పేర్కొంది. సెక్యూరిటీ గార్డ్ వారిస్తున్నప్పటికీ లోపలకు చొచ్చుకొచ్చిన సూసైడ్ బాంబర్ తనను పేల్చేసుకున్నాడని సీనియర్ అధికారి సయీద్ వాజిర్ తెలిపారు. పేలుడు స్వభావం ఇపుడే నిర్ణయించలేమని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. మరోవైపు క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







