పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సం..

- December 29, 2015 , by Maagulf
పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో  జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సం..

పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సాన్ని సృష్టించింది. మార్దాన్ నగరంలో చోటు చేసుకున్న ఈ పేలుడులో 22 మంది మరణించగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ డాటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అధారిటీ కార్యాలయం దగ్గర ఆ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియా పేర్కొంది. సెక్యూరిటీ గార్డ్ వారిస్తున్నప్పటికీ లోపలకు చొచ్చుకొచ్చిన సూసైడ్ బాంబర్ తనను పేల్చేసుకున్నాడని సీనియర్ అధికారి సయీద్ వాజిర్ తెలిపారు. పేలుడు స్వభావం ఇపుడే నిర్ణయించలేమని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. మరోవైపు క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com