డబల్ రోల్ లో కనిపించనున్న కీర్తి
- March 25, 2019మహానటి చిత్రంతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి..ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హిట్స్ కాలేకపోయాయి. అయినాగానీ అమ్మడికి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ ఆఫర్ కూడా ఒకటి. ఫుట్ బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపిస్తుండగా.. అతని భార్యగా కీర్తి నటించనుంది. కథ ప్రకారం సినిమాలో కీర్తి డబుల్ రోల్ ప్లే చేస్తోందట. అందులోఒకటి మధ్యవయస్కురాలి పాత్ర..మరోటి యంగ్ గా కనిపిస్తుందట. మధ్యవయస్కురాలి పాత్ర కోసం టీమ్ ఆమెకు ప్రత్యేకమైన మేకప్ వేయనున్నట్లు సమాచారం. 1953 నుంచి 1963 వరకు ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు అబ్దుల్ రహీం అనే వ్యక్తి కోచ్ గా పనిచేశారు. ఆయన జీవితం ఆధారంగా అమిత్ శర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బోనికపూర్, ఆకాష్ చావ్లా, అరణవ సేన్ గుప్తాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ