డబల్ రోల్ లో కనిపించనున్న కీర్తి
- March 25, 2019
మహానటి చిత్రంతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి..ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హిట్స్ కాలేకపోయాయి. అయినాగానీ అమ్మడికి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ ఆఫర్ కూడా ఒకటి. ఫుట్ బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపిస్తుండగా.. అతని భార్యగా కీర్తి నటించనుంది. కథ ప్రకారం సినిమాలో కీర్తి డబుల్ రోల్ ప్లే చేస్తోందట. అందులోఒకటి మధ్యవయస్కురాలి పాత్ర..మరోటి యంగ్ గా కనిపిస్తుందట. మధ్యవయస్కురాలి పాత్ర కోసం టీమ్ ఆమెకు ప్రత్యేకమైన మేకప్ వేయనున్నట్లు సమాచారం. 1953 నుంచి 1963 వరకు ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు అబ్దుల్ రహీం అనే వ్యక్తి కోచ్ గా పనిచేశారు. ఆయన జీవితం ఆధారంగా అమిత్ శర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బోనికపూర్, ఆకాష్ చావ్లా, అరణవ సేన్ గుప్తాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







