గాయపడ్డ ఫుట్బాల్ ఆటగాడ్ని పరామర్శించిన మొహమ్మద్
- March 25, 2019యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న ఫుట్ బాల్ ఆటగాడ్ని పరామర్శించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే వున్న ఓ బిగ్ పోల్ని ఢీకొని అల్ జజీరా ఆటగాడు అహ్మద్ రబీ తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో రబీని రూలర్ పరామర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రబీని రూలర్ పరామర్శిస్తున్న దృశ్యాలు, గాయపడ్డ దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వద్ద ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు రూలర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు