దుబాయ్ నుంచి ఫ్లై అవుతున్నవారికి ఎమిరేట్స్ అడ్వయిజరీ
- March 27, 2019
ఈ వారాంతంలో దుబాయ్ నుంచి ఫ్లయ్ అయ్యేవారికి ఎమిరేట్స్ ఓ సూచన చేసింది. వీకెండ్లో ఎయిర్పోర్ట్లో క్రౌడ్ ఎక్కువగా వుండే అవకాశం వుందనీ, మరీ ముఖ్యంగా మార్చి 29న పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వచ్చే అవకాశం వున్న దరిమిలా, ప్రయాణీకులు ముందస్తుగా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలని ఎమిరేట్స్ సూచించింది. టెర్మినల్ 3లో మార్చి 29న 42,000 మందికి పైగా ప్రయాణీకులతో అత్యంత బిజీగా వుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2 వరకు పీక్ ట్రావెల్ కొనసాగవచ్చునని ఎమిరేట్స పేర్కొంది. ఈ సమయంలో 205,000 ఎమిరేటీలు దుబాయ్ నుంచి వెళతారని అంచనా. అలాగే 160,000 మంది ప్రయాణీకులు దుబాయ్కి వస్తారని అంచనా వేశారు. కనీసం 60 నిమిషాల ముందు చెక్ ఇన్కి రాని ప్రయాణీకులకు ప్రయాణానికి అనుమతినివ్వరు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







