ఫోర్బ్స్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌లో టాప్‌ 5 యూఏఈ వలసదారులు భారతీయులే

- March 27, 2019 , by Maagulf
ఫోర్బ్స్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌లో టాప్‌ 5 యూఏఈ వలసదారులు భారతీయులే

ఫోర్బ్స్‌ బిలియనీర్‌ లిస్ట్‌ 2019లో చోటు దక్కించుకున్న ఎమిరేటీ ఇలియనీర్లలో ఐదుగురు యూఏఈ వలసదారులున్నారు. వారంతా ఇండియాకి చెందినవారు కావడం గమనార్హం. దశాబ్దాలుగా యూఏఈలో వీరు తమ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. వీరిలో బిజినెస్‌ టైకూన్‌ ఎంఎ యూసుఫ్‌ అలి 394 ర్యాంక్‌ సంపాదించుకున్నారు. యూఏఈలో రిచెస్ట్‌ వలసదారుడిగా వున్నారీయన. ఈయన మొత్తం సంపద 4.7 బిలియన్‌ డాలర్లు. తరువాతి స్థానంలో మిక్కీ జగితియానీ నిలిచారు. 4 బిలియన్‌ డాలర్ల సంపాదనతో 478వ ర్యాంక్‌లో నిలిచారీయన. బిఆర్‌ షెట్టి 2.8 బిలియన్‌ డాలర్లతోనూ, సన్నీ వార్కీ 2.4 బిలియన్‌ డాలర్లతోనూ, పిఎన్‌సి మీనన్‌ 1.1 బిలియన్‌ డాలర్లతోనూ తదుపరి స్థానాల్లో నిలిచారు. వీరందరి సంపాదన 15.1 బిలియన్‌ డాలర్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com