డ్రగ్స్‌ సేవించిన వ్యక్తి: దుబాయ్‌ క్రీక్‌లో అరెస్ట్‌

- March 30, 2019 , by Maagulf
డ్రగ్స్‌ సేవించిన వ్యక్తి: దుబాయ్‌ క్రీక్‌లో అరెస్ట్‌

28 క్యాప్సూల్స్‌ డ్రగ్స్‌ని తీసుకున్న ఓ వ్యక్తి ఆ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. నైజీరియాకి చెందిన 29 ఏళ్ళ వ్యక్తి, దుబాయ్‌లో విజిట్‌ వీసాపై వుంటున్నాడు. 468 గ్రాముల యాంఫిటమిన్‌ని క్యాప్సూల్స్‌ రూపంలో నిందితుడు కడుపులో దాచుకన్నట్లు అధఙకారులు తెలిపారు. దుబాయ్‌ క్రీక్‌ ద్వారా స్విమ్‌ చేస్తూ వాటిని స్మగుల్‌ చేయడానికి నిందితుడు యత్నించాడు. అయితే నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించేందుకు తొలుత నిరాకరించాడు. గత ఏడాది నవంబర్‌ 4న ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా, కోర్టు తీర్పుని సవాల్‌ చేసేందుకు న్యాయస్థానం 15 రోజుల అవకాశం కల్పించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com