నాన్నకు ప్రేమతో తొలి ఆడియో సీడీను నాన్నకు ఇచ్చా
- December 30, 2015
రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉండగా, ఈయన మ్యూజిక్ అంటే చెవి కోసుకునే సంగీత ప్రియులు ఎందరో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన నాన్నకు ప్రేమతో చిత్ర ఆడియో ఇటీవల విడుదల కాగా, ఈ ఆల్బం మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.దేవి శ్రీ ఫాదర్ సత్యమూర్తి ఇటీవల గుండెపోటుతో మరణించగా, ఆయన మరణం దేవిని ఎంతగానో కలచి వేసింది. తన ప్రతీ విజయం వెనుక తండ్రి ఉన్నారనే భావించే దేవి తన తండ్రి మరణాన్ని అసలు తట్టుకోలేకపోయారు. అయితే ఆ సమయంలో కూడా తండ్రి కోరిక మేరకు, చనిపోయిన రెండు రోజుల తర్వాత నాన్నకు ప్రేమతో మ్యూజిక్ పనులను మొదలు పెట్టారు దేవి శ్రీ.దేవి శ్రీ ప్రసాద్ తన మొదటి చిత్రం దేవి నుండి ఇప్పటి వరకు తొలి ఆడియో సీడిను తన తల్లిదండ్రులకు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోగా, నాన్నకు ప్రేమతో చిత్ర ఆడియో రిలీజ్ సమయానికి తన తండ్రి లేకపోవడం ఈ సంగీత దర్శకుడిని మరింత బాధకు గురి చేసింది. దీంతో దేవి ఈ సారి నాన్నకు ప్రేమతో తొలి ఆడియో సీడీను నాన్నకు ఇచ్చానంటూ ట్విట్టర్లో ఓ ఫోటోను పోస్ట్ చేసారు. తన తండ్రి ఫోటో దగ్గర సీడీ పెట్టిన ఆ ఫోటో అభిమానులను ఎంతగానో కదిలించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







