కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి
- April 05, 2019దుబాయ్:90 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయింది. తనయుడి మృతదేహం పక్కనే తల్లి మృతదేహాన్ని ఖననం చేశారు కుటుంబ సభ్యులు. గత నవంబర్లో అహ్మద్ అనే 68 ఏళ్ళ వ్యక్తికి నెక్ క్యాన్సర్ సోకింది. జర్మనీకి ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్ళి, స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకోపక్క, వయసు మీద పడ్డంతో పలు అనారోగ్య సమస్యలతో రెండు నెలలుగా తన తల్లి కోమాలో వుందని మృతురాలి మరో తనయుడు అబ్దుల్సలామ్ సలెహ్ చెప్పారు. సలెహ్ సోదరుడు అహ్మద్, రషీద్ ఆసుపత్రిలో చికిత్స పొందాడనీ, అదే ఆసుపత్రిలో తన తల్లి కూడా చికిత్స పొందిందనీ, ఏప్రిల్ 2న తన సోదరుడు ప్రాణాలు కోల్పోగా, కోమాలోంచి తన తల్లి బయటకు వచ్చిందనీ, దురదృష్టవశాత్తూ అహ్మద్ని ఖననం చేసిన రెండు గంటల తర్వాత తన తల్లి ప్రాణం కోల్పోయిందని చెప్పారు సలెహ్. అల్ ఖోజ్ సిమిటెరీలో తన సోదరుడి సమాధి పక్కనే తన తల్లి సమాధిని కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు