'చిత్రలహరి' ట్రైలర్‌ విడుదల

- April 07, 2019 , by Maagulf
'చిత్రలహరి' ట్రైలర్‌ విడుదల

'నా పేరు విజయ్‌.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో లేదు. ఆ విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను' అంటున్నారు సాయి ధరమ్ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. తన జీవితం ఎంత నరకంగా ఉందో ధరమ్‌ తేజ్‌ వివరిస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. 'ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..' అని ధరమ్‌ తేజ్‌ బాధపడుతూ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com