అమెరికా ప్రయాణం మరింత కఠినం..
- April 27, 2019
అమెరికా ప్రయాణం మరింత కఠినం కానుంది. విజిటింగ్ వీసా మరింత అనేక మార్పులు చేస్తోంది ట్రంప్ సర్కారు. భారతీయులే టార్గెట్గా.. అడ్మిషన్ బాండ్స్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే జరిగితే.. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, వ్యాపారులు, ముఖ్యంగా భారతీయులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
భారతీయులే టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వీసా చట్టాన్ని కఠినతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, బిజినెస్ పీపుల్, ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బందులకు గురవ్వనున్నారు. విజిటింగ్ వీసాలను అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ అడ్మిషన్ బాండ్స్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి వైట్హౌస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
గత నవంబర్ నాటికే అమెరికాలో మొత్తం 1.96 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వీరి సంఖ్య అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో.. 18 శాతం కావడం విశేషం. కాగా 2013లో యూకే సైతం విజిటింగ్ వీసాలను కట్టడి చేసేందుకు ఇలాంటి సెక్యూరిటీ బాండ్ల విధానాన్నే ప్రవేశపెట్టింది.
మొత్తం ఆరు దేశాలకు చెందిన పౌరులు యూకేను సందర్శించాలంటే 3వేల పౌండ్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన పెట్టింది. అయితే ఎంపిక చేసిన 6 దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రధానంగా అమెరికాకు వచ్చే బిజినెస్, టూరిస్ట్ ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను తగ్గించే దిశగా ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..