హైదరాబాద్ లో యువకుడి ప్రాణాలను బలిగొన్న అతి వ్యాయామం
- April 29, 2019హైదరాబాద్:అతి వ్యాయామం ఓ యువకడి ప్రాణాలను బలికొంది..ఎస్.ఆర్.నగర్ లో నివాసముండే ఆదిత్యా స్థానిక గోల్డెన్ జిమ్ లో వ్యాయామం చేస్తున్నాడు.. అయితే ఈ రోజు జిమ్ చేసిన తరువాత రూంకి వెళ్లిన తరువాత ఛాతి నొప్పిరావడంతో ఆసుపత్రి తీసుకెళ్లే లోపు మరణించాడు. కాగా పంజాబ్ కు చెందిన ఆదిత్య డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఎస్.ఆర్. నగర్ లోని గోల్డెన్ జిమ్ కు వచ్చి వ్యాయామం చేస్తున్నాడు. సోమవారం ఉదయం జిమ్ లో చాలా సేపు ఎక్సర్ సైజ్ చేసిన ఆదిత్య.. జిమ్ లో ఎక్కువసేపు వ్యాయామముతో ఒక్కసారిగా నీరసించి ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయాడు.
జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లేట్ ఇచ్చారు. టాబ్లేట్ వేసుకున్నాక ఆదిత్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఛాతీలో నొప్పిగా ఉందని ఆదిత్య చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ఆదిత్య చనిపోయినట్టు వైద్యుల నిర్ధారించారు. దాంతో గోల్డెన్ జిమ్ పై ఎస్.ఆర్. నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదయింది. ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. మరోవైపు అధిక సమయం జిమ్ లో ఎక్సర్ సైజ్ చేయించడంతో ఆదిత్య మృతి చెందాడని మృతుని స్నేహితులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?