డబ్బింగ్ పనుల్లో 'సాహో'
- May 04, 2019బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూవీ షూటింగ్ చివరిదశకి చేరుకుంది. శుక్రవారంతో సాహో షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ రోజు (మే 4, 2019) నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలవ్వనున్నాయి. ఆగష్టు 15న సాహో ఆడియన్స్ ముందుకి రానుంది.
సాహో ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో ప్రభాస్ వెంటనే రాధాకృష్ణ సినిమాకి షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నాడు. సాహో డబ్బింగ్ పూర్తిగాకానే మే పదిన యూరప్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డె జంటగా రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ యూరప్ లో జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్