ఇస్తాంబుల్ ఎన్నిక రద్దుపై టర్కీ కమ్యూనిస్టు పార్టీ నిరసన
- May 09, 2019
ఇస్తాంబుల్ : ఇస్తాంబుల్ నగరపాలక సంస్థ ఎన్నికలను రద్దు చేయాలన్న అధ్యక్షుడు ఎర్డోగాన్ నిర్ణయాన్ని సమర్ధించిన టర్కీ సుప్రీం ఎలక్షన్ కౌన్సిల్ (వైఎస్కె) నిర్ణయాన్ని టర్కీ కమ్యూనిస్టు పార్టీ నిరసించింది. ఎర్డోగాన్ నిర్ణయాన్ని సమర్ధించటం ద్వారా వైఎస్కె ప్రజల ఓటు హక్కును కాలరాసిందని ఒక ప్రకటనలో విమర్శించింది. గత మార్చి 31న పూర్తయిన ఎన్నికలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని దీర్ఘకాలం సాగదీసి చివరకు నిర్ధారించటం ద్వారా వైఎస్కె ఎర్డొగాన్ బలహీనతను వెల్లడించటంతో పాటు దేశంలో రాజకీయ సంక్షోభం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని తెలిపింది. తమ ఇష్టం వచ్చిన వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకునే హక్కు ప్రజలకున్నదన్న విషయాన్ని అటు ఎర్డోగాన్తోపాటు ఇటు వైఎస్కె కూడా విస్మరించిందని వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







