ఖతార్కు బి-52 బాంబర్లను తరలించిన అమెరికా
- May 11, 2019వాషింగ్టన్:ఇరాన్తో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా వాయుసేన ఖతార్లోని తమ వైమానిక స్థావరానికి బి-52 తరహా బాంబర్ యుద్ధ విమానాలను తరలించింది. ఇరాన్ నుండి ఎటువంటి అనూహ్యమైన ముప్పు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ విమానాలను తరలిస్తున్నట్లు వాయుసేన ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు తమ వద్దకు బి-52 బాంబర్ యుద్ధ విమానాలు గురువారం రాత్రి చేరుకున్నట్లు కతార్లోని అమెరికా వాయుసేన అధికారులు చెప్పారు. ఈ విమానాలు లూసియానాలోని 20వ బాంబ్ స్క్వాడ్రన్ నుండి వచ్చాయని, ఇతర బి-52లు ఆగేయాసియాలోని ఒక ప్రాంతానికి చేరుకున్నాయని వాయుసేన తన ప్రకటనలో వివరించింది. అంతకు ముందు లూసియానా నుండి టేకాఫ్ తీసుకుంటున్న బి-52 బాంబర్లతో కూడిన వీడియోను అమెరికన్ వాయుసేన విడుదల చేసింది.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు