ఇఫ్తార్ హోస్టింగ్ ఎంతో సంతృప్తికరం: క్రిస్టియన్ వలసదారుడు
- May 11, 2019
ఫుజైరా కి చెందిన భారత వలసదారుడు సాజి చెరియన్, యూఏఈలో ఓ మసీదు నిర్మించడమే కాక, ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందని క్రిస్టియన్ అయిన సాజి చెరియన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ కోసమే అన్ని అనుమతులూ తీసుకుని మసీదు నిర్మించినట్లు చెప్పారాయన. ఫుజైరా చేరుకోవాలంటే 20 నుంచి 30 దిర్హామ్లు ట్యాక్సీ ఫేర్ చెల్లించాల్సి వుంటుందనీ, అలా డబ్బు వెచ్చించలేని వారి కోసమే మసీదు నిర్మించానని అన్నారు చెరియన్. ఎయిర్ కండిషన్డ్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించి, అక్కడే వందలాది మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. 2004లో చెరియన్ దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఇప్పుడాయన ఓ వ్యాపార వేత్తగా ఎదిగారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!