ఇఫ్తార్ హోస్టింగ్ ఎంతో సంతృప్తికరం: క్రిస్టియన్ వలసదారుడు
- May 11, 2019ఫుజైరా కి చెందిన భారత వలసదారుడు సాజి చెరియన్, యూఏఈలో ఓ మసీదు నిర్మించడమే కాక, ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందని క్రిస్టియన్ అయిన సాజి చెరియన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ కోసమే అన్ని అనుమతులూ తీసుకుని మసీదు నిర్మించినట్లు చెప్పారాయన. ఫుజైరా చేరుకోవాలంటే 20 నుంచి 30 దిర్హామ్లు ట్యాక్సీ ఫేర్ చెల్లించాల్సి వుంటుందనీ, అలా డబ్బు వెచ్చించలేని వారి కోసమే మసీదు నిర్మించానని అన్నారు చెరియన్. ఎయిర్ కండిషన్డ్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించి, అక్కడే వందలాది మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. 2004లో చెరియన్ దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఇప్పుడాయన ఓ వ్యాపార వేత్తగా ఎదిగారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక