మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు జపాన్ శ్రీకారం..
- May 12, 2019టోక్యో:బుల్లెట్ ట్రైన్స్కు పెట్టింది పేరు జపాన్. ఆదేశంలో బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా పరుగులు తీస్తాయి. తాజాగా మరో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్కు జపాన్ శ్రీకారం చుట్టనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైలును రూపొందించారు. టెస్టు రన్లో అంతా సవ్యంగా సాగితే రవణా రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు వచ్చినట్లే అవుతుంది.
ఆల్ఫా-ఎక్స్ వర్షెన్కు చెందిన షిన్కాన్సేన్ రైలును రూపొందించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుంటే 2030 నాటికి ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కుతుంది. ప్రవేశ పెట్టిన కొత్తలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు తీస్తుందని అధికారులు తెలిపారు. చైనాలోని ఇదే ఆల్ఫా ఎక్స్ వర్షెన్ బుల్లెట్ రైలు ఉన్నప్పటికీ జపాన్ రైలుతో పోలిస్తే అది 10 కిలోమీటర్ల వేగం తక్కువ అని అధికారులు తెలిపారు. ఇక జపాన్ ప్రవేశపెట్టనున్న హైస్పీడు రైలుకు 10 బోగీలు ఉంటాయని చెప్పారు. ముందర భాగం చాలా పొడవుగా ఉంటుందని అధికారులు వివరించారు.
ట్రయల్ రన్
సెండాయ్ నుంచి ఆవ్ మోరి వరకు ట్రయల్ రన్
హైస్పీడ్ రైలును సెండాయ్ నుంచి ఆవ్మోరి వరకు ప్రయోగాత్మకంగా నడుపుతామని జపాన్ అధికారులు తెలిపారు. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 280 కిలోమీటర్లు. అర్థరాత్రి తర్వాత ఈ రైలు పట్టాలపై పరుగులు తీస్తుందని ఆ సమయంలో అన్ని పరిశీలించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇలా వారానికి రెండు సార్లు హైస్పీడ్ రైలును ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దీనికంటే ముందు మరో హైస్పీడు రైలు షిన్కాన్సేన్ ఎన్ 700ఎస్ మోడల్ ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా రైలు 2020లో పట్టాలు ఎక్కుతుందని చెప్పారు. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?