హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు
- May 14, 2019హైదరాబాద్: హీరాగోల్డ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన కోర్టు 7రోజులు పాటు కస్టడీకి అనుమతించింది. నౌహీరాతో పాటు బిజూ థామస్, మౌళి థామస్ను కూడా ఈడీ కస్టడీకి తీసుకోనుంది. 50 వేల కోట్ల రూపాయలు మనీలాండిరింగ్ పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. కాగా ఈ ముగ్గుర్నీ మరి కాసేపట్లో చంచల్ గూడ జైల్ నుంచి ఈడీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించునున్నారు.
ఇదిలా ఉంటే.. తిరుపతికి చెందిన హీరా గోల్డ్ గ్రూపు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్ డిపాజిట్లు చేయించుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ గ్రూపు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇప్పటికే హీరా గోల్డ్లో మనీ లాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు గుర్తించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..