తలకు గాయంతో వ్యక్తి మృతి
- May 14, 2019
బహ్రెయిన్:ఓ గొడవలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ వలసదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని హర్దీప్ సింగ్ సెఖాన్గా గుర్తించారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో వైద్య చికిత్స పొందుతూ హర్దీప్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గొడవ ముదరడంతో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టుకున్నారనీ, ఈ క్రమంలో మిగతావారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారనీ, హర్దీప్ మాత్రం తలకు తీవ్రంగా గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలికి తీవ్ర గాయమయ్యింది. అతనికీ వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగుర్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. రిఫ్ఫా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్









