తలకు గాయంతో వ్యక్తి మృతి
- May 14, 2019బహ్రెయిన్:ఓ గొడవలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ వలసదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని హర్దీప్ సింగ్ సెఖాన్గా గుర్తించారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో వైద్య చికిత్స పొందుతూ హర్దీప్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గొడవ ముదరడంతో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టుకున్నారనీ, ఈ క్రమంలో మిగతావారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారనీ, హర్దీప్ మాత్రం తలకు తీవ్రంగా గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలికి తీవ్ర గాయమయ్యింది. అతనికీ వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగుర్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. రిఫ్ఫా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..