తలకు గాయంతో వ్యక్తి మృతి

- May 14, 2019 , by Maagulf
తలకు గాయంతో వ్యక్తి మృతి

బహ్రెయిన్‌:ఓ గొడవలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ వలసదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని హర్దీప్‌ సింగ్‌ సెఖాన్‌గా గుర్తించారు. సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో వైద్య చికిత్స పొందుతూ హర్దీప్‌ సింగ్‌ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గొడవ ముదరడంతో గ్రూప్‌ ఆఫ్‌ పీపుల్‌ కొట్టుకున్నారనీ, ఈ క్రమంలో మిగతావారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారనీ, హర్దీప్‌ మాత్రం తలకు తీవ్రంగా గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలికి తీవ్ర గాయమయ్యింది. అతనికీ వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగుర్ని మాత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిఫ్ఫా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com