తలకు గాయంతో వ్యక్తి మృతి
- May 14, 2019
బహ్రెయిన్:ఓ గొడవలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ వలసదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని హర్దీప్ సింగ్ సెఖాన్గా గుర్తించారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో వైద్య చికిత్స పొందుతూ హర్దీప్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గొడవ ముదరడంతో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టుకున్నారనీ, ఈ క్రమంలో మిగతావారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారనీ, హర్దీప్ మాత్రం తలకు తీవ్రంగా గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలికి తీవ్ర గాయమయ్యింది. అతనికీ వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగుర్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. రిఫ్ఫా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







