ఎస్‌యూవీ ప్రమాదంలో కువైటీ మృతి

- May 14, 2019 , by Maagulf
ఎస్‌యూవీ ప్రమాదంలో కువైటీ మృతి

కువైట్‌: కువైటీ పౌరుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెవెన్త్‌ రింగ్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌ - కువైట్‌ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టరేట్‌ ఈ ఘటన గురించి వివరిస్తూ, సంఘటనా స్థలానికి ఫైర్‌ ఫైటర్స్‌ రికార్డు సమయంలో చేరుకున్నట్లు వెల్లడించడం జరిగింది. సెక్యూరిటీ మెన్‌, పారామెడిక్స్‌ ఘటనా స్థలానికి చేరుకుని, వాహనం నుంచి కువైటీ పౌరుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారనీ, అయితే తీవ్ర గాయాలతో అతను మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కి తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com