ఒమన్లో గాయపడ్డ కార్మికుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- May 17, 2019మస్కట్: ఒమన్లో గాయపడ్డ భారతీయ వలస కార్మికుడికి సాయం అందించేందుకు ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ముందుకొచ్చింది. ఒమన్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రాజేంద్రప్రసాద్కి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది ఇండియన్ ఎంబసీ. అలాగే, ప్రసాద్కి సాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీకి చెందిన సోషల్ మరియు వెల్ఫేర్ వర్కర్స్ సాయం చేయాలని కోరింది. ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇండియన్ కమ్యూనిటీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఆయనకు సహాయం అందించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. రాజేంద్రప్రసాద్కి ఇప్పటికే కొన్ని శస్త్ర చికిత్సలు జరిగాయనీ, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు