పీఎంఎస్బీవై ఇన్సూరెన్స్ స్కీం..
- May 20, 2019ఏ ప్రమాదమూ తెలిసి జరగదు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అక్కరకొస్తాయి ఇన్సూరెన్స్ పాలసీలు. అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమాతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలజీ తీసుకుంటే ఉత్తమం. ప్రభుత్వం కూడా సామాజిక భద్రత నేపథ్యంలో పలు స్కీములు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బావై) ఒకటి. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ పాలసీ కొంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుంది.
పీఎంఎస్బావై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాలసీ వ్యవధి సంవత్సరము. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. స్కీమ్లో జాయిన్ అయ్యే ముందే ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు అంగీకారం తెలపాలి. అంటే మీ అకౌంట్ నుంచి పాలసీ ప్రీమియం ప్రతి ఏడాది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.12. మే 25 నుంచి 31 మధ్య కాలంలో పాలసీ ప్రీమియం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ కవర్ వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలు లభిస్తాయి. అదే పాక్షిక అంగవైకల్యానికి అయితే రూ.1 లక్ష వస్తుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!