టాలీవుడ్ సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
- May 20, 2019తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మదనమ్మ తుదిస్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె అంత్య క్రియలు స్వగ్రామమైన చల్లగిరిలో జరుగనున్నాయి.
చంద్రబోస్ స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండల చల్లగిరి గ్రామం. నర్సయ్య, మదనమ్మ దంపతుల నలుగురు సంతానంలో చంద్రబోస్ అందరికంటే చిన్నవాడు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. వారి మూలంగా చిన్నతనంలోనే చంద్రబాబోస్లో సాహిత్యబీజం పడింది.
గతంలో ఓ సందర్భంలో చంద్రబోస్ మాట్లాడుతూ.. చిన్నతనంలో తన తల్లి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూపించేందుకు తనను తీసుకెళ్లేదని, ఈ క్రమంలోనే తాను సాహిత్యంపై, పాటలపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపారు. అలా జరిగి ఉండకపోతే తాను ఇపుడు ఈ రంగంలో ఉండేవాడిని కాదేమో అన్నారు.
ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పట్టబద్రుడైన చంద్రబోస్... దూరదర్శన్లో సింగర్గా ప్రయత్నించాడు. అయితే అది ఫలించక పోవడంతో తన స్నేహితుడి సూచన మేరకు పాటలు రాయడం వైపు టర్న్ అయ్యారు. 1995లో తొలిసారిగా 'తాజ్ మహల్' అనే చిత్రానికి పాటలు రాశారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక