యూ.ఏ.ఈ:ఇఫ్తార్ విందుతో గిన్నీస్ రికార్డ్
- May 21, 2019యూ.ఏ.ఈ:ముస్లిం సోదరుకలు అతి పవిత్రమైన మాసం రమదాన్. ఆకాశంలలో నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే రమదాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి ఆహారాన్ని తీసుకుంటారు. ఖీర్ (పాయసం),ఖర్చూరం వంటి బలాన్నిచ్చే ఫ్రూట్స్ తో ఉపవాసాన్ని ముగిస్తారు.
ఇలా తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని'సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని' ఇఫ్తార్' అని అంటారు.
ఈ ఇఫ్తార్ విందులో దుబాయ్ లో భారత్ కు చెందిన ఓ చారిటీ సంస్థ గిన్నీస్ రికార్డ్ సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు కొనసాగిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవునా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈ ఘనతను సాధించినట్టు గల్ఫ్న్యూస్ తెలిపింది. శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని తినటం వల్ల జంతువధను అరికట్టవచ్చుని తెలిపారు. ఈ రికార్డు సాధించడంలో సహకారాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు పీసీటీ హ్యుమానిటీ చారిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ సలారియా.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..