దుబాయ్లో ముగ్గురు స్కామర్స్ అరెస్ట్
- May 21, 2019ముగ్గురు సభ్యులుగల స్కామర్స్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ముందుంచారు. అక్రమంగా వందలాది సిమ్ కార్డుల్ని జారీ చేసినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్టయినవారిలో ఒకరు మొబైల్ ఓనర్. వినియోగదారుడి అనుమతి లేకుండా, అతని పేరు మీద సిమ్కార్డ్స్ని నిందితుడు జారీ చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో సాక్షి ఓ ఆఫ్రికన్ వర్కర్. సిమ్ కార్డ్ కోసం తాను ఓ షాప్కి వెళ్ళగా, అక్కడ తనకు సిమ్కార్డ్ లభ్యం కాలేదనీ, ఆ తర్వాత ఆరా తీస్తే, తన పేరు మీద తనకు తెలియకుండా సిమ్కార్డులు జారీ అయినట్లు తేలిందని బాధితుడు చెప్పారు. ఇలాంటి స్కామ్ ద్వారా పలు స్కామ్స్కి నిందితులు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఇతరుల నుండి డబ్బులు గుంజుతున్నట్లు తేల్చిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన