పదవ పట్టాభిషేక అభినందనలు తెలిపిన యు.ఏ.ఈ అధ్యక్షుడు

- January 02, 2016 , by Maagulf
పదవ పట్టాభిషేక అభినందనలు తెలిపిన యు.ఏ.ఈ  అధ్యక్షుడు

ఉప రాష్టపతి , ప్రధాన మంత్రి  యునైటెడ్ అరబ్ ఎమరట్స్ అధ్యక్షుడు  షేక్ ఖలీఫా  బిన్ జాయెద్ అల్ నహయన్,జనవరి 4 వ తేదీన అబుదాబి పాలకుడు  యువరాజు  షేక్ మొహమద్   బిన్ రషీద్ కు  జరగబోయే పదవ పట్టాభిషేక వార్శికోస్థావ కార్యక్రమానికి  ప్రత్యేక అభినందనలు  తెలిపారు.గత 10 ఏళ్ళ కాలంలో చక్కని 

కార్యనిర్వహణ తో జనరంజకంగా పరిపాలించారని, ప్రజలను ఆధునిక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.' గౌరవనీయ యువరాజు.. నా ప్రియ  సోదరుడు షేక్ మొహమద్ బిన్ రషీద్ పదేళ్ళ పాలన  అత్యంత ప్రతిష్టాత్మకంగా  సమర్ధవంతంగా...ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఆయన ఎంతో పారదర్సకం గా  పాలిస్తూ  పౌరులంతా సంతృప్తికరంగా..సంతోషంగా జీవిస్తున్నారని తన అభినంధనల సందేశంలో అభివర్ణించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com