రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు..
- May 23, 2019వరుసగా రెండో సారి ప్రధాని పదవిని అలంకరిస్తున్న మోదీ ఈ విజయానికి ఆయన చేసిన ఒంటరి పోరాటమే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సొంత మెజారిటీతో రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. కీలకమైన రాష్ట్రాల్లో భాజాపా పట్టు సాధించింది. హిందీ ప్రధాన భాషగా ఉన్న రాష్ట్రాలు మోదీకి వెన్నుదన్నుగా నిలిచాయి. బీహార్, చత్తీస్ఘడ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఝుర్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, దిల్లీలో భాజపా తన విశ్వరూపాన్ని చూపించింది. బలమైన ఓటు బ్యాంకులు ఉన్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు కలిసినా భాజాపాను అడ్డుకోలేకపోయాయి.
చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. అయినా జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చేసరికి వారికి మోదీనే బలమైన వ్యక్తిగా కనిపించారు. జమ్ముకశ్మీర్లో కూడా తన పట్టును నిరూపించుకుంది. సొంతరాష్ట్రమైన గుజరాత్లో మోదీ ఏమాత్రం పట్టు కోల్పోలేదనడానికి ఈ ఫలితాలే రుజువు. ఇక దేశ ప్రజలు మోదీని బలమైన నేతగా చూస్తున్నారన్న విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయి. గతంలో రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో బలమైన నేతగా ఎదిగారు. మోదీ స్వతంత్రంగా తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలే ఆయన్ను తిరుగులేని నేతగా చేశాయి. ధైర్యవంతుడైన పాలకుడిగా మోదీ ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన్ను విజయం మరోసారి వరించింది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు