ఇండియన్ టైకూన్ని సత్కరించిన షేక్ హమదాన్
- May 24, 2019దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ల్యాండ్ మార్క్ గ్రూప్ని ఫస్ట్ స్పోర్ట్స్ ఇంప్రింట్ అవార్డ్తో సత్కరించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు వతానీ అల్ ఎమరాత్ ఫౌండేషన్ సహకారంతో ఈ అవార్డుని అందించారు. నాద్ అల్ షెబా స్పోర్ట్స్ టోర్నమెంట్ సందర్భంగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ సందర్భంగా ల్యాండ్ మార్క్ గ్రూప్ ఛైర్మన్ మిక్కీ జగితియానీని సత్కరించారు. బెస్ట్ డయాబెటిస్ వాక్ పేరుతో డయాబెటిస్ పట్ల అవగాహన కలిగించేందుకు ల్యాండ్ మార్క్ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్ని అభినందించారు షేక్ హమదాన్. 20,000 మందికి పైగా పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అలాగే ఎమిరేట్స్ డయాబెటిస్ సొసైటీకి మద్దతుగా ల్యాండ్ మార్క్ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం